నడిరోడ్డుపై ఖాకీల దురుసు ప్రవర్తన ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ప్రజాసమస్యలపై అడిగినందుకు ఓ ప్రజా ప్రతినిధిని పబ్లిక్ అంతా చూస్తుండగానే తిడుతూ..చొక్కా పట్టుకుని లాక్కిళ్లి అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. రెండు రోజుల క్రితం తొర్రూర్లో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన మృతుడి కుంటుంబానికి కాంట్రాక్టర్ న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వీరికి అమ్మాపూర్ ఎంపీటీసీ విక్రమ్రెడ్డి కూడా మద్దతుగా నిలిచారు. అయితే రోడ్డుపై ఆందోళన చేస్తున్న విక్రమ్రెడ్డి సహా అందరిపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. ఎంపీటీసీ చెప్పేది వినకుండా వీణ్ని అరెస్ట్ చేయండి అంటూ గట్టిగా అరుస్తూ అదుపులోకి తీసుకున్నారని ఆరోపించాడు విక్రమ్రెడ్డి. స్టేషన్లో కూడా తనను దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశాడు.