ఐటీలో తెలంగాణ భేష్‌: మ‌ంత్రి కేటీఆర్

|

Jun 20, 2020 | 8:47 PM

ఐటీ రంగంలో తెలంగాణ అద్భుత ప్ర‌గ‌తి సాధించింద‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వ‌రుస‌గా ఆరో ఏడాది ఐటీ రంగం నివేదిక‌ను మంత్రి కేటీఆర్ విడుద‌ల చేశారు.

ఐటీలో తెలంగాణ భేష్‌: మ‌ంత్రి కేటీఆర్
Follow us on

ఐటీ రంగంలో తెలంగాణ అద్భుత ప్ర‌గ‌తి సాధించింద‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వ‌రుస‌గా ఆరో ఏడాది ఐటీ రంగం నివేదిక‌ను మంత్రి కేటీఆర్ విడుద‌ల చేశారు. జాతీయ స‌గ‌టు ఐటీ ఎగుమ‌తుల క‌న్నా తెలంగాణ‌ ఐటీ ఎగుమ‌తుల స‌గ‌టు ఎక్కువ‌గా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

జాతీయ స‌గ‌టు 8.09 శాతం ఉంటే తెలంగాణ స‌గ‌టు 17.93శాతం ఉంద‌న్నారు మంత్రి కేటీఆర్‌.టెక్ మహీంద్రా, సైయంట్ కంపెనీలు తమ కేంద్రాలను వరంగల్‌లో ఓపెన్ చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. అమెజాన్ తన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని, మైక్రాన్ తన అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించినట్టు కేటీఆర్ వెల్లడించారు. 2013-14లో రూ. 57,258 కోట్లు ఉన్న ఐటీ ఎగుమ‌తుల విలువ 2019-20లో రూ.1,28,807 కోట్ల‌కు చేరింద‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.