కేసీఆర్ పెట్ డాగ్ ‘ హస్కీ ‘ మృతి కేసు.. పోలీసులు ఏమంటున్నారంటే ?

|

Oct 13, 2019 | 2:40 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్ డాగ్ ‘ హస్కీ ‘ మృతి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ సర్టిఫయిడ్ కాపీ ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ యాక్టివిస్టు ఒకరు చేసిన అభ్యర్థనను బంజారాహిల్స్ పోలీసులు తోసిపుచ్చారు. ఈ వివరాలను వెల్లడిస్తే అది ఈ కేసు దర్యాప్తును నీరు గారుస్తుందని, లేదా ‘ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ‘ ను ప్రభావితం చేయవచ్చునని వారంటున్నారు. ఇంకా దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రగతిభవన్ లో ఇటీవల హస్కీ అనే పెంపుడు కుక్క మృతికి వెటర్నరీ […]

కేసీఆర్ పెట్ డాగ్  హస్కీ  మృతి కేసు.. పోలీసులు ఏమంటున్నారంటే ?
Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్ డాగ్ ‘ హస్కీ ‘ మృతి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ సర్టిఫయిడ్ కాపీ ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ యాక్టివిస్టు ఒకరు చేసిన అభ్యర్థనను బంజారాహిల్స్ పోలీసులు తోసిపుచ్చారు. ఈ వివరాలను వెల్లడిస్తే అది ఈ కేసు దర్యాప్తును నీరు గారుస్తుందని, లేదా ‘ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ‘ ను ప్రభావితం చేయవచ్చునని వారంటున్నారు. ఇంకా దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రగతిభవన్ లో ఇటీవల హస్కీ అనే పెంపుడు కుక్క మృతికి వెటర్నరీ డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. 11 నెలల వయసున్న ఈ శునకం ‘ హల్క్ ‘ బ్రీడ్ కు చెందినది. పిట్ బుల్ కు, బుల్ డాగ్ కు మధ్య బ్రీడ్ వల్ల పుట్టింది ఇది.. గత సెప్టెంబర్ 11 న ఓ వెటర్నరీ డాక్టర్ ఇఛ్చిన ఇంజెక్షన్ కారణంగా ఈ శునకం మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రగతి భవన్ లో పెట్ డాగ్స్ బాగోగులు చూసే ఆసిఫ్ అలీ అనే వ్యక్తి ఇఛ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ డాక్టర్ తో బాటు ప్రయివేటు వెటర్నరీ క్లినిక్ డాక్టర్ ఇంచార్జి నిర్లక్ష్యం కూడా హస్కీ మరణానికి కారణమని ఆయన పేర్కొన్నారు.(ఇంజెక్షన్ వికటించి ఆ కుక్క మరణించినట్టు తెలుస్తోంది). ఈ కేసులో రంజిత్ అనే వెటర్నరీ డాక్టర్ పైన, సంబంధిత క్లినిక్ ఇన్-ఛార్జి డాక్టర్ లక్ష్మీ శీనివాసన్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించడానికి పోలీసులు ఎందుకు నిరాకరిస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.