‘జూబ్లీ హిల్స్’ మెట్రో.. రేపటి నుంచి రైయ్.. రైయ్!

|

May 17, 2019 | 8:17 PM

మెట్రో రైల్ ప్రయాణికులకు ఓ శుభవార్త. రేపటి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ విషయాన్ని స్వయముగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఇక జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్  రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నాగోల్‌ – హైటెక్‌సిటీ మార్గంలో ఉన్న అన్ని స్టేషన్లూ దాదాపు అందుబాటులోకి వచ్చినట్టే. కాగా అమీర్‌పేట – హైటెక్‌సిటీ మెట్రో మార్గం ఈ ఏడాది మార్చి 20 […]

జూబ్లీ హిల్స్ మెట్రో.. రేపటి నుంచి రైయ్.. రైయ్!
Follow us on

మెట్రో రైల్ ప్రయాణికులకు ఓ శుభవార్త. రేపటి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ విషయాన్ని స్వయముగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఇక జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్  రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నాగోల్‌ – హైటెక్‌సిటీ మార్గంలో ఉన్న అన్ని స్టేషన్లూ దాదాపు అందుబాటులోకి వచ్చినట్టే.

కాగా అమీర్‌పేట – హైటెక్‌సిటీ మెట్రో మార్గం ఈ ఏడాది మార్చి 20 నుంచి ప్రారంభమైంది. అయితే ఆ సమయంలో 5 స్టేషన్లే అందుబాటులోకి వచ్చాయి. దశల వారిగా మాదాపూర్‌, పెద్దమ్మగుడి స్టేషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.