హైదరాబాద్: ఎన్నికల వేళ రాజధానిలో భారీగా నగదు పట్టుబడుతోంది. నగరం నుంచి వివిధ జిల్లాలకు, సరిహద్దు రాష్ట్రాలకు వాహనాల్లో అక్రమంగా డబ్బును తరలిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో అన్ని చోట్లా ప్రత్యేక పోలీసు బృందాలు ఆకస్మిక తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నాయి. సోమవారం నారాయణగూడ ప్లైఓవర్ దగ్గర భారీ నగదును పోలీసులు పట్టుకున్నారు. ఓ కారులో తరలిస్తున్న రూ.8 కోట్ల నగదును సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి వివరాలను సేకరిస్తున్నారు.