TSRTC: టీఎస్ఆర్టీసీ మరో శుభవార్త.. వారి ఇబ్బందులు తీర్చేందుకు ప్రత్యేక కేంద్రాలు

|

May 21, 2022 | 12:32 PM

వందలాది రైళ్లు.. వేల మంది ప్రయాణికులతో నిత్యం కిటకిటలాడే సికింద్రాబాద్(Secunderabad) రైల్వే స్టేషన్ ఒక పద్మవ్యూహాన్ని తలపిస్తుంటుంది. ఇక నగరానికి కొత్తగా వచ్చే వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఎటెళ్లాలో, ఎవరిని అడగాలో తెలియక....

TSRTC: టీఎస్ఆర్టీసీ మరో శుభవార్త.. వారి ఇబ్బందులు తీర్చేందుకు ప్రత్యేక కేంద్రాలు
Secunderabad
Follow us on

వందలాది రైళ్లు.. వేల మంది ప్రయాణికులతో నిత్యం కిటకిటలాడే సికింద్రాబాద్(Secunderabad) రైల్వే స్టేషన్ ఒక పద్మవ్యూహాన్ని తలపిస్తుంటుంది. ఇక నగరానికి కొత్తగా వచ్చే వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఎటెళ్లాలో, ఎవరిని అడగాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడతారు. వారి ఇబ్బందులను గమనించిన ఆర్టీసీ(TSRTC) ఆ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు ప్రయాణికులు నగరంలోని తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు గందరగోళం లేకుండా స్టేషన్లోని 1, 10 ప్లాట్‌ఫారంలపై ‘మే ఐ హెల్ప్‌యూ’ పేరిట సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రయాణికులు ఎక్కడికెళ్లాలో కనుక్కొని, వారికి బస్సుల సమాచారమిస్తారు. ఏ బస్సులెక్కడ ఆగుతాయో వివరిస్తారు. స్టేషన్ నుంచి బస్‌స్టేషన్‌ చేరేవరకు సైన్‌బోర్డులు ఏర్పాటుచేస్తున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సామాన్లతో వచ్చే ప్రయాణికులను బస్‌స్టేషన్లో దింపేందుకు సమాచార కేంద్రాల వద్దే టీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ వాహనాలనూ ఉంచుతోంది. ఇందుకు సాధారణ ఛార్జీలు వసూలుచేస్తారు.

అంతకుముందు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు నాలుగు వైపులా ఉన్న బస్టాపులను అనుసంధానం చేస్తూ మినీ బస్సులు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కేవలం రూ.5 టికెట్‌తో ప్రయాణికులు ఒక బస్టాపు నుంచి మరో బస్టాప్ వరకు వెళ్లే విధంగా అధికారులు ప్రయోగాత్మకంగా ఒక బస్సును నడిపిస్తున్నారు. రెండు, మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న ఆయా బస్టాపుల్లో ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు ప్రయాణికులు నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటోల్లో వెళ్లాలంటే కొద్దిపాటి దూరానికే రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించాల్సి వస్తోంది. వీరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ, గ్రేటర్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Hyderabad: ట్రాన్స్‌జెండర్ల నిర్వాకం.. అడ్డగించి మరీ డబ్బులు లాక్కున్నారు.. అర్ధరాత్రి ఇదేంటని ప్రశ్నించినందుకు..

బలహీనంగా ఆ పరిశ్రమలు.. గణనీయంగా తగ్గిన పెట్టుబడులు