కేటీఆర్ బర్త్‌డే.. ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ఎంపీ

| Edited By: Pardhasaradhi Peri

Jul 24, 2019 | 7:51 AM

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన ఇవాళ 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలంటూ ఆర్భాటాలు చేయకండని గతంలో తెలిపిన కేటీఆర్ ఏదైనా మంచి పనులు చేయండంటూ అభ్యర్థించారు. ఇందుకోసం గిఫ్ట్ ఎ స్మైల్ అనే కార్యక్రమాన్ని పెట్టారు. ఇక దీనిపై స్పందించిన టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.. తాను కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఎంపీ నిధులతో 2042 ఎకరాలు గల ఈ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి […]

కేటీఆర్ బర్త్‌డే.. ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ఎంపీ
Follow us on

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన ఇవాళ 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలంటూ ఆర్భాటాలు చేయకండని గతంలో తెలిపిన కేటీఆర్ ఏదైనా మంచి పనులు చేయండంటూ అభ్యర్థించారు. ఇందుకోసం గిఫ్ట్ ఎ స్మైల్ అనే కార్యక్రమాన్ని పెట్టారు. ఇక దీనిపై స్పందించిన టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.. తాను కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటానని ప్రకటించారు.

ఎంపీ నిధులతో 2042 ఎకరాలు గల ఈ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని సంతోష్ ట్విట్టర్‌లో తెలిపారు. త్వరలో ఆ ప్రాంతంలో పర్యటించి అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. దీన్ని ఎకోటూరిజం ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్ది హైదరాబాద్ వాసులకు బహుమతిగా ఇస్తామన్నారు. ఇక అటవీ ప్రాంతాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలంటూ కేటీఆర్, కవిత, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటులు నితిన్, విజయ్ దేవరకొండ, పారిశ్రామికవేత్త ముత్తా గోపాల్‌ను ట్యాగ్ చేశారు.