భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్కు 13 పాసింజర్ రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సంస్థ తాజాగా వెల్లడించింది. దాదాపు ఆరు నెలల పాటు ఈ సేవలు కనుమరుగు కానున్నాయి. 2020 జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది.
రద్దు చేసిన 13 పాసింజర్ వివరాలు:
1. సికింద్రాబాద్-మేడ్చల్-సికింద్రాబాద్
2. సికింద్రాబాద్-మనోహరాబాద్-సికింద్రాబాద్
3. ఫలక్నుమా-మేడ్చల్-ఫలక్నుమా
4. ఫలక్నుమా-ఉందానగర్-ఫలక్నుమా
5. ఫలక్నుమా-మనోహరాబాద్-సికింద్రాబాద్
6. బొల్లారం-ఫలక్నుమా
అలాగే తదితర రూట్లలో తిరిగే 12 డెమూ ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే సంస్థ.. ప్రత్యామ్యాయాల్ని విస్మరించింది. దీంతో.. ప్రయణికులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా.. రైల్వే స్టేషన్స్లో కూడా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.