TSRTC ఎండీగా చార్జ్ తీసుకున్నప్పటి నుంచి.. సంస్థను గాడిలో పెట్టడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సజ్జనార్. ఆక్యూపెన్సీ పెంచేందుకు ఇప్పటికే పలు రకాల నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో రేట్లు పెంచి.. ప్రయాణీకులపై కాస్త భారం కూడా వేశారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం.. సుఖవంతం అంటూ పాత ట్యాగ్లైన్ను కాస్త గట్టిగా జనంలోకి తీసుకెళ్తున్నారు. తాజాగా విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకన్నారు. దూర ప్రాంతాల నుంచి నగరంలోని పలు కళాశాలలకు వచ్చే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జారీ చేసిన బస్పాస్లను పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉపయోగించుకునేందుకు అనుమతించారు.
శివారు ప్రాంతాల నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ సిటీలోని కాలేజీలు, స్కూళ్లకు వచ్చి చదువకుంటున్నారు. వీరు ప్రతిరోజూ డైలీ సర్వీస్ చేస్తుంటారు. అయితే ప్రజంట్ వారికి TSRTC జారీ చేసిన పాసులు కేవలం సిటీ బస్సుల్లోనూ చెల్లుతున్నాయి. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆ పాసులు చెల్లుబాటు అవ్వడం లేదు. నగర శివారు ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో సిటీ బస్సులు వెళ్లడం లేదు. దీంతో ప్రేవేట్ వాహనాలు ఆశ్రయిస్తుండంటంతో విద్యార్థులపై భారం పడుతుంది. ఈ క్రమంలో స్టూడెంట్స్తో పాటు వారి పేరెంట్స్ నుంచి సంస్థకు పెద్ద ఎత్తున రిక్వెస్టులు వచ్చాయి. ఆపై రివ్యూ చేసిన అనంతరం సిటీ బస్పాస్ ఉన్న స్టూడెంట్స్.. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులోనూ ట్రావెట్ చేసేందుకు అనుమతిస్తూ ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
గ్రేటర్ #Hyderabad పరిధిలోని విద్యార్థులకు శుభవార్త. గ్రేటర్ హైదరాబాద్ బస్సు పాస్ తో ఇక నుంచి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ గా నడిచే పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణించడానికి అనుమతి. విద్యార్థుల రద్దీ దృష్ట్యా #TSRTC యాజమాన్యం నిర్ణయం. ఈ సదుపాయాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోగలరు. pic.twitter.com/TWrWLbe2sV
— Managing Director – TSRTC (@tsrtcmdoffice) November 23, 2022
టీఎస్ఆర్టీసీ సిటీ బస్సుల కొరత విద్యార్థుల ప్రయాణానికి ఇబ్బందిగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సగటున, కళాశాల బస్సులు సంవత్సరానికి రూ. 30,000 వసూలు చేస్తాయి. అయితే RTC బస్సు పాస్కు 10 నెలలకు 4,000 మాత్రమే ఖర్చు అవుతుంది. దీంతో విద్యార్థులకు సంవత్సరానికి 24 వేలకు వరకు భారం తగ్గుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..