Prime Minister Brother: ఛార్మినాగర్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ సోదరుడు.. అతని కోసమే ప్రార్థించానంటూ..

|

Feb 13, 2021 | 6:53 PM

Prahlad Modi at Bhagyalaxmi Temple: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ పర్యటించారు.

Prime Minister Brother: ఛార్మినాగర్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ సోదరుడు.. అతని కోసమే ప్రార్థించానంటూ..
Follow us on

Prahlad Modi at Bhagyalaxmi Temple: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రహ్లాద్ మోదీ.. గతేడాది భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య జరిగి ఘర్షణల్లో అమరుడైన వీరజవాను కల్నల్ సంతోష్ జన్మదినం సందర్భంగా అమ్మవారికి పూజలు చేశానని చెప్పుకొచ్చారు. కల్నల్ సంతోష్ ఆత్మకు శాంతి కలగాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు. భారత సైనికులందరూ శత్రువుల పట్ల కల్నల్ సంతోష్‌లా పోరాటం చేయాలని ఆకాంక్షించారు.

కాగా, గతేడాది భారత్-చైనా సరిహద్దుల్లో గల గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ అమరుడయ్యారు. ఇటీవలె కేంద్ర ప్రభుత్వం కల్నల్ మహేష్ వీరత్వానికి ప్రతీకగా మహా వీర చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేసింది.

Also read:

జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం, తగిన సమయంలో రాష్ట్ర ప్రతిపత్తి

Republic Day Violence: రైతు ఉద్యమం ఎఫెక్ట్.. దీప్‌ సిద్ధూను ఎర్రకోటకు తీసుకెళ్లిన పోలీసులు.. ఎందుకంటే..?