నగరంలోని ఎంఎంటీఎస్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. యాకుత్పురా, ఫలక్నుమా సెక్షన్లో మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో లింగంపల్లి, ఫలక్నుమాతోపాటు ఫలక్నుమా నుంచి లింగంపల్లి మధ్య రాకపోకలు సాగించే నాలుగు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని… మరుసటి రోజు యథావిధిగా రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు.