కోల్కతా ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెకు మెడికవర్ హాస్పిటల్స్ పూర్తి మద్దతునిచ్చింది . దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ ఆసుపత్రులలో ఓపీ సేవలను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ అధినేత, చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. “ఇలాంటి అమానవీయమైన సంఘటనతో దేశం విస్తుపోయింది. యావత్ భారతావని దిగ్భాంతికి లోనయింది. ఈ సంఘటన అందరిని కలిచివేసింది. అత్యంత హేయమైన ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి” అని అన్నారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ.. ” నేడు దేశమంతా ఏకమై సమైక్య గళం వినిపిస్తున్నది. ఈ సంఘటన అత్యంత భాదాకరమైనది. ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తూ ఈరోజు మేము అందరం బాధితురాలికి మద్దతునిస్తూ మా ఓపీ సేవలను బహిష్కరించాం”. అని అన్నారు
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ “ప్రజల ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్కు ఇలా జరగడం దారుణాతిదారుణం. ఈ ఘటన నన్నెంతో బాధకు గురిచేసింది. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని శిక్షించాలి, ఆ బంగారుతల్లి ఆత్మ శాంతించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.