హెరిటేజ్ హైదరాబాద్ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ప్రజలంతా ప్రకృతిని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఉదయం పీపుల్స్ ప్లాజాలో సేవ్ అవర్ హెరిటేజ్ పేరుతో వాక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనేక మంది ఔత్సాహికులు ఎంతో ఉత్సాహంగా ఈ వాక్ లో పాల్గొన్నారు.