Osmania University Lands – High Court: ఓయూ(ఉస్మానియా యూనివర్శిటీ) భూములు కబ్జా వ్యవహారం మీద ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. సుమారు 3 వేల గజాలకు పైగా వర్శిటీకి చెందిన భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమిస్తున్నారని ఓయూ విద్యార్థి పి.రమణారావు లేఖ రాసిన నేపథ్యంలో ఈ అంశం మీద ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఏజీ(అడ్వకేట్ జనరల్) వివరణ ఇస్తూ.. యూనివర్శిటీ భూములు కబ్జాకు కాకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. తులసి హౌజింగ్ సొసైటీపై ఓయూ.. పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఏజీ కోర్టుకు విన్నవించారు.
అయితే, ఆ కేసుకు సంబంధించిన కేసు దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ సీపీ, అంబర్ పేట పోలీసులను ప్రవాదులుగా చేర్చిన హైకోర్టు.. ఈ కేసు విచారణను అక్టోబరు20కి వాయిదా వేసింది.