మరో రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. తమిళనాడు నుంచి ఛత్తీస్ గఢ్ వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిన ప్రభావంతో.. తెలంగాణలో ఆది, సోమ వారాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరింది. ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షాలు పడనున్నాయట. గత రెండు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా కరీనంగర్ జిల్లా వెల్దిలో 60, సర్వాయిపేటలో 44.3, హుస్నాబాద్లో 30.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.