Breaking: ఇకపై వారికి ప్రత్యేక పాసులు అవసరం లేదు: తెలంగాణ పోలీసులు

| Edited By:

Jun 02, 2020 | 7:18 PM

ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుండి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ పోలీసులు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్ర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్‌లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసులు అన్నారు. కాగా తెలంగాణ నుంచి అంతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం ఇప్పటి వరకు డీజీపీ కార్యాలయం ప్రత్యేకంగా పాసులు జారీ చేసేది. తాజాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా […]

Breaking: ఇకపై వారికి ప్రత్యేక పాసులు అవసరం లేదు: తెలంగాణ పోలీసులు
Follow us on

ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుండి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ పోలీసులు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్ర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్‌లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసులు అన్నారు. కాగా తెలంగాణ నుంచి అంతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం ఇప్పటి వరకు డీజీపీ కార్యాలయం ప్రత్యేకంగా పాసులు జారీ చేసేది. తాజాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా అంతర రాష్ట్ర ప్రయాణాలకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రాన్స్ పోర్ట్ పాసులను పోలీసు శాఖ నిలిపి వేసింది. ఇక తెలంగాణకు వచ్చే వాహనాలకు కూడా పాస్‌లు అడగడం లేదు.

Read This Story Also: పాపులర్ సీఎంల లిస్ట్.. నాలుగో స్థానంలో వైఎస్ జగన్..!