అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్

|

Jul 21, 2019 | 2:11 PM

సికింద్రాబాద్‌: జంటనగరాల్లో బోనాల సంబురం ప్రారంభమైంది. లష్కర్‌ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు సీఎంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం కోసం ఆదివారం ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్
Follow us on

సికింద్రాబాద్‌: జంటనగరాల్లో బోనాల సంబురం ప్రారంభమైంది. లష్కర్‌ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు సీఎంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం కోసం ఆదివారం ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.