కరోనా టెన్షన్.. కేసీఆర్ సమావేశం జరిగిందిలా..!

| Edited By:

Jun 16, 2020 | 8:30 PM

తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. దీంతో మిగిలిన ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ మొదలైంది. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో కోవిడ్ నియమాలకు ఆధారంగా ఇవాళ ప్రగతి భవన్‌లో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్.

కరోనా టెన్షన్.. కేసీఆర్ సమావేశం జరిగిందిలా..!
Follow us on

తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. దీంతో మిగిలిన ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ మొదలైంది. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో కోవిడ్ నియమాలకు ఆధారంగా ఇవాళ ప్రగతి భవన్‌లో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి మొదలుకొని సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, డీపీఓలందరికీ మొదట ఉష్ణోగ్రతలను పరిశీలించారు. ఆ తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాళంలోని నీళ్లు, సబ్బుతో అందరూ చేతులు శుభ్రం చేసుకున్నారు. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా హ్యాండ్ సానిటైజర్స్ ఇవ్వడంతో చేతులను సానిటైజ్ చేసుకున్నారు. సమావేశంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించారు.

మధ్యాహ్న భోజనం విషయంలోనూ అన్ని జాగ్రత్తలు
ఇక సమావేశంలో పాల్గొన్న అధికారులకు మధ్యాహ్న భోజన విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. డైనింగ్ హాలును పూర్తిగా శానిటైజ్ చేసి.. వంట చేసే వారితోపాటు వడ్డించే వారికి కూడా శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేసి, లోపలకు పంపారు. వంట సిబ్బంది అందరూ చేతులకు గ్లౌజులు, నోటికి మాస్కులు, తలకు ప్రత్యేకమైన టోపీలు ధరించారు. ఒక్కొక్కరూ రెండు మీటర్ల దూరం ఉంటూ వంటలు చేశారు. ఒక మీటరు దూరంలో ఉంచి అందరికీ వడ్డించారు. వాడి పడవేసే చెక్క స్పూన్లనే ఉపయోగించారు.

Read This Story Also: ఓ వైపు బాధ.. మరోవైపు గర్వంగా ఉంది: కల్నల్ సంతోష్ తల్లి