ఎస్‌ఐ వేధింపులు: ఏఎస్‌ఐ మృతి

| Edited By: Srinu

Dec 02, 2019 | 4:53 PM

ఎస్‌ఐ వేధింపుల కారణంగా.. ఏఎస్‌ఐ నర్సింహులు అనే వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని బాలాపూర్ పీఎస్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తోన్నాడు నర్సింహులు. అయితే.. అధికారి నుంచి వేధింపులు మరీ ఎక్కువ అవడంతో.. గత నెల నవంబర్ 22వ తేదీన పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన సదరు స్థానికులు ఆయన్ని రక్షించి.. ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఏఎస్ఐ పూర్తిగా గాయాలపాలయ్యారు. కాగా.. అప్పటినుంచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సింహులు ఈ రోజు ఏఎస్ఐ నర్సింహులు మృతి చెందాడు. […]

ఎస్‌ఐ వేధింపులు: ఏఎస్‌ఐ మృతి
Follow us on

ఎస్‌ఐ వేధింపుల కారణంగా.. ఏఎస్‌ఐ నర్సింహులు అనే వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని బాలాపూర్ పీఎస్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తోన్నాడు నర్సింహులు. అయితే.. అధికారి నుంచి వేధింపులు మరీ ఎక్కువ అవడంతో.. గత నెల నవంబర్ 22వ తేదీన పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన సదరు స్థానికులు ఆయన్ని రక్షించి.. ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఏఎస్ఐ పూర్తిగా గాయాలపాలయ్యారు. కాగా.. అప్పటినుంచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సింహులు ఈ రోజు ఏఎస్ఐ నర్సింహులు మృతి చెందాడు.

అయితే.. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న.. ఎస్ఐ సైదులను ఇప్పటికే.. బదిలీ చేయడం చూస్తుంటే.. నర్సింహుల ఆరోపణలు నిజమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంటల్లో.. ఉన్న ఏఎస్‌ఐను.. కాపాడి.. ఆస్పత్రికి తరలించారు ఇతర సిబ్బంది. అతనిచ్చిన మరణ వాగ్మూలంలో.. అనేక విషయాలు తెలిపారు. నా సర్వీసులో.. నేను ఎలాంటి తప్పులు చేయలేదని.. ఎస్‌ఐనే నామీద లేనిపోని ఆరోపణలు సృష్టించారని నర్సింహులు పేర్కొన్నాడు.