Cyber fraud: తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభాలు.. మెసేజ్ చూసి క్లిక్ చేశారా..? మీ పని గోవిందా!
టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. వివిధ పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట కోట్లు కొల్లగొడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. తక్కువ ఇన్వెస్ట్ మెంట్ పెడితే ఎక్కువ లాభాలు పొందవచ్చని సైబర్ కేటుగాళ్లు వేసిన వలలో చిక్కి, భారీ మొత్తంలో మోసపోయారు.
టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. వివిధ పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట కోట్లు కొల్లగొడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. తక్కువ ఇన్వెస్ట్ మెంట్ పెడితే ఎక్కువ లాభాలు పొందవచ్చని సైబర్ కేటుగాళ్లు వేసిన వలలో చిక్కి, భారీ మొత్తంలో మోసపోయారు నగరానికి చెందిన కొందరు అమాయకులు. తాము మోసపోయామని గమనించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను కేరళలో అరెస్ట్ చేశారు పోలీసులు
సైబర్ క్రైమ్స్ పై ఎంత అవగాహన కల్పించినా నిత్యం ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. పెట్టుబడులు-అధిక లాభాల పేరుతో సైబర్ కేటుగాళ్లు వేసిన వలకు ఎంతోమంది అమాయకులు చిక్కి బలవుతున్నారు. తాజాగా ఇన్వెస్ట్మెంట్ పేరిట తొమ్మిది లక్షల 44 వేల రూపాయలు పైగా మోసపోయానని, హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ లాభాలు పొందవచ్చని సైబర్ నేరగాళ్లు, టెలిగ్రామ్లో బాధితుడుకి మెసేజ్ చేశారు. ముందు నిందితులు బాధితుడి ఖాతా లో కొంత లాభాలు వేశారు. ఇది నమ్మిన బాధితుడు సొంత డబ్బులను భారీగా పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత బాధితుడి అకౌంట్ బ్లాక్ చేశారు నిందితులు. 9 లక్షల 44 వేల రూపాయలు మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను కేరళలో అరెస్ట్ చేశారు..
కేరళలో కొన్నిరోజుల పాటు క్యాంప్ వేసి మరీ నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత.. అమాయకులను టెలిగ్రామ్ ద్వారా మెసేజ్లు పెట్టి మోసాలు చేస్తున్నారన్నారు. సైబర్ క్రైమ్ ద్వారా వచ్చే అమౌంట్ ని రెంట్ కి తీసుకున్న బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నారన్నారు.. ఆయా అకౌంట్స్ నుంచి దుబాయ్ కి క్రిప్టో కరెన్సీ ద్వారా పంపిస్తున్నారని తెలిపారు. 18 అకౌంట్స్ ద్వారా 26 కోట్ల రూపాయల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తించామన్నారు డీసీపీ..ఆన్ లైన్ లింక్ లు, వెబ్ సైట్లు, వ్యక్తులను నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఏదేమైనా సైబర్ నేరానికి గురైతే నేరం జరిగిన వెంటనే 1930 కు కాల్ చేయాల్సిందిగా ప్రజలకి పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…