Hyderabad: ఒక్క ప్రకటనతో సేవింగ్స్ మొత్తం ఖతం.. డబ్బులు నష్టపోకుండా ఈ సలహా..

| Edited By: Srikar T

Jun 22, 2024 | 4:02 PM

మీ సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా.. అందుకోసం కష్టపడి డబ్బు కూడబెట్టారా.. ఓ మంచి రియల్ ఎస్టేట్ కంపెనీ చూసి వారికి డబ్బు అప్పగిస్తున్నారా.. అక్కడే కాస్త ఆలోచించండి. వారు చేసే ప్రకటనల వెనుక ఎంత మోసం ఉందో కనిపెట్టండి. తరువాతే డబ్బు కట్టండి. లేదంటే మీ డబ్బు పోయి.. మీ ఆశలు అడియాసలు అవ్వడం ఖాయం. తెలంగాణలో రోజుకో రియల్ ఎస్టేట్ కంపెనీ పుట్టుకొస్తోంది.

Hyderabad: ఒక్క ప్రకటనతో సేవింగ్స్ మొత్తం ఖతం.. డబ్బులు నష్టపోకుండా ఈ సలహా..
Gsr Infra
Follow us on

మీ సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా.. అందుకోసం కష్టపడి డబ్బు కూడబెట్టారా.. ఓ మంచి రియల్ ఎస్టేట్ కంపెనీ చూసి వారికి డబ్బు అప్పగిస్తున్నారా.. అక్కడే కాస్త ఆలోచించండి. వారు చేసే ప్రకటనల వెనుక ఎంత మోసం ఉందో కనిపెట్టండి. తరువాతే డబ్బు కట్టండి. లేదంటే మీ డబ్బు పోయి.. మీ ఆశలు అడియాసలు అవ్వడం ఖాయం. తెలంగాణలో రోజుకో రియల్ ఎస్టేట్ కంపెనీ పుట్టుకొస్తోంది. ఫ్రీలాంచ్ పేరుతో పెద్ద పెద్ద ప్రకటనలు చేసి జనాలను ఈజీగా మోసం చేస్తున్నారు. పేద మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కలను క్యాష్ చేసుకొని వారిని నిలువునా దోచేస్తున్నారు. తీరా బాధితులు లబోదిబోమన్నా వారికి న్యాయం జరగడం కలగానే మిగులుతోంది. ప్రతి వ్యక్తికి తనకంటూ ఓ సొంత ఇళ్లు ఉండాలని కలలు కంటాడు. అందుకోసం పస్తులు ఉండి మరీ రూపాయి రూపాయి కూడబెడుతాడు. అలా కాస్త డబ్బు జమ కాగానే స్థలాలు, ఇళ్ల వేట మొదలు పెడతాడు.

ఇదే చాలా మంది అవినీతి వ్యాపారులకు వరంగా మారింది. జనాల కలలకు కాస్త మెరుగు పెట్టి ప్రకటనలతో మభ్యపెడుతున్నారు. ఆ తరువాత అందినంత దోచుకొని పారిపోతున్నారు. సిటీలో ఇటీవల ఫ్రీ లాంచ్ పేరుతో జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ హయత్ నగర్, కొంపల్లి, యాదాద్రి, షాద్ నగర్‎లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టింది. ఆకర్షణీయమైన క్యాట్ లాగ్ తయారు చేసిన ఫ్రీ లాంచ్ అంటూ తక్కువ పెట్టుబడితో లగ్జరీ హౌస్ అంటూ ప్రకటనలు చేసింది. దీనికి ఆకర్షితులైన చాలా మంది మధ్య తరగతి వారు తమ కల నేరవేరుతుందనుకొని జిఎస్ఆర్ రియల్ ఎస్టేట్ ఎండి శ్రీనివాస్‎ని కలిశారు. నెలలు, సంవత్సరాలు కష్టపడి దాచుకున్న లక్షల రూపాయలు అతనికి ముట్టజెప్పారు. అనుకున్న ప్రకారం కోట్ల రూపాయల డబ్బు చేతికి చిక్కేసరికి ఇంకేముంది ఆ సంస్థ బిచాణా ఎత్తేసింది. ఆ తరువాత శ్రీనివాస్ కోర్టు నుండి ముందస్తు బేయిల్ తీసుకొని కనిపించకుండా పోయాడు.

బాధితులు హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం ఒక్క జిఎస్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీనే కాదు నగరంలో అనేక రియల్ మాఫియాలు ఇదే తరహాలో జనాలను దోచుకుంటున్నాయి. డబ్బులు కట్టిన తరువాత రిజిస్ట్రేషన్ చేయకుండా జనాలను నానా ఇబ్బందులు పెడుతున్నాయి. శివార్లలో మంచి ఆఫర్ అంటూ పేద, మధ్య తరగతి పడే కష్టాలను ఇట్టే దోచుకుంటున్నాయి. అయితే జనాలను ఇలాంటి మోసాలను ముందే గుర్తించాలని అంటున్నారు పోలీసులు. ఏదైనా ల్యాండ్ కొనుగోలు కోసం వెళితే దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలని ఆ తరువాతే డబ్బు అప్పగించాలంటున్నారు. ఏదిఏమైనా ముందు చూపు లేకుండా పరుగులు తీస్తే ఇదిగో ఈ జిఎస్ఆర్ తరహాలో జనాలను మోసం చేయడానికి అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. ఆచితూచి అడుగుపెట్టక పోతే సర్వం మాయమైపోవడం ఖాయం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..