GHMC Elections Results 2020: బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తి..కాసేపట్లో తొలి రౌండ్‌ ఫలితం..ముందంజలో..

|

Dec 04, 2020 | 10:36 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాసేపట్లో తొలి రౌండ్‌ ఫలితం వెలువడే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్లలో 92 డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో..

GHMC Elections Results 2020:  బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తి..కాసేపట్లో తొలి రౌండ్‌ ఫలితం..ముందంజలో..
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాసేపట్లో తొలి రౌండ్‌ ఫలితం వెలువడే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్లలో 92 డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, టీఆర్‌ఎస్‌ 33 డివిజన్లలో ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పోస్టల్‌ ఓట్లలో నాలుగు చోట్ల కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉండగా, 15 చోట్ల ఎంఐఎమ్‌ లీడ్ లో ఉన్నట్లు సమాచారం.

అయితే, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కేవలం 1,926ఓట్ల లెక్కింపు మాత్రమే పూర్తైంది. ఇంకా, అసలైన లెక్కింపు ప్రక్రియ జరగాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే అసలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతోంది. ఓరిజినల్‌ ఓట్ల లెక్కింపుతోనే గెలుపు ఎవరినీ వరిస్తుందనే అంచనా వేయగలమంటున్నారు నిపుణులు. తక్కువ పోలింగ్‌ జరిగిన డివిజన్లలో ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా 34 లక్షలకు పైగా ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది.