గాంధీ నుంచి పరారైన కొవిడ్ ఖైదీల ఫొటోలు విడుదల

|

Aug 28, 2020 | 8:44 PM

నిన్న హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి నుండి పరారయ్యిన నలుగురు నిందితుల ఫొటోలు పోలీసులకు చిక్కాయి. వీరిని సోమ సుందర్, నరసింహ, అర్భాజ్,జావిద్ లుగా గుర్తించారు...

గాంధీ నుంచి పరారైన కొవిడ్ ఖైదీల ఫొటోలు విడుదల
Follow us on

నిన్న హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి నుండి పరారయ్యిన నలుగురు నిందితుల ఫొటోలు పోలీసులకు చిక్కాయి. వీరిని సోమ సుందర్, నరసింహ, అర్భాజ్,జావిద్ లుగా గుర్తించారు. వీరు నలుగురు కోవిడ్ పాజిటివ్ రోగులన్న సంగతి తెలిసిందే. ఈ నేరస్తుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వీరి ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రివార్డ్ ప్రకటించారు. వీళ్లంతా కోవిడ్ వార్డ్ నుండి బాత్రూం కిటికీ ద్వారా పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితులు నలుగురు సాధారణ దుస్తుల్లోనే బయటికి వెళ్ళారని.. వీరి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇస్తున్నారు.