లారీ బోల్తా.. నలుగురు దుర్మరణం..

| Edited By:

Jul 16, 2020 | 4:41 AM

మహబూబాబాద్‌ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొర్రూరు మండలం చీటాయపాలెంలో.. కట్టెల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు..

లారీ బోల్తా.. నలుగురు దుర్మరణం..
Follow us on

మహబూబాబాద్‌ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొర్రూరు మండలం చీటాయపాలెంలో.. కట్టెల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతు తండాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి ఓవర్‌ లోడ్‌తో పాటు.. అతివేగం కూడా ఓ కారణమై ఉండొచ్చని ప్రాథిమికంగా నిర్ణారణకు వచ్చారు.