కరీంనగర్ జిల్లా కేశవపట్నం కస్తూరిబాగాంధీ పాఠశాలలో విద్యార్థినిల అదృశ్యం కలకలం రేపుతోంది. పదవ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినిలు గత రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. వారి అదృశ్యంపై స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అదృశ్యమైన విద్యార్థినిలు రేవణ్య, భవాని, రేణుకా, ఐశ్వర్య, తేజశ్రీ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.