Minister Etela Rajender: తెలంగాణలో విపక్ష నాయకుల తీరుపై మంత్రి రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం నాడు హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు నాయకుుల నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోబోమని మంత్రి ఈటల స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ బీసీలకు అన్ని రంగాల్లో పెద్ద పీట వేస్తున్నారని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి మీకు కనిపించడం లేదా? అంటూ విపక్ష నాయకులను మంత్రి ఈటల ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిలా ఉండాలనే ఉద్దేశంతోనే తనను ఆర్థిక మంత్రిగా నియమించారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని బీజేపీ నేతలను మంత్రి నిలదీశారు.
Also read:
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన… ఎన్నికలే లక్ష్యంగా హామీ… ఏం ప్రకటించారంటే…