Medaram: మేడారం పూజారులను వెంటాడుతున్న మరణాలు.. అనారోగ్యంతో మరో పూజారి మృతి!

| Edited By: Balaraju Goud

Jul 27, 2024 | 10:55 AM

మేడారంలో పూజారుల వరుస మరణాలు కలవర పెడుతున్నాయి. మొన్న సమ్మక్క పూజారి అనారోగ్యంతో మృతిచెందగా, తాజాగా సారలమ్మ పూజారి మృతి చెందడం తీవ్ర విశాదాన్ని మిగిల్చింది. విషయం తెలిసిన వెంటనే దిగ్భ్రాంతికి లోనైనా మంత్రి సీతక్క మృతుల కుటుంబాలను ఫోన్‌లో పరామర్శించారు.

Medaram: మేడారం పూజారులను వెంటాడుతున్న మరణాలు.. అనారోగ్యంతో మరో పూజారి మృతి!
Medaram Priests
Follow us on

మేడారంలో పూజారుల వరుస మరణాలు కలవర పెడుతున్నాయి. మొన్న సమ్మక్క పూజారి అనారోగ్యంతో మృతిచెందగా, తాజాగా సారలమ్మ పూజారి మృతి చెందడం తీవ్ర విశాదాన్ని మిగిల్చింది. విషయం తెలిసిన వెంటనే దిగ్భ్రాంతికి లోనైనా మంత్రి సీతక్క మృతుల కుటుంబాలను ఫోన్‌లో పరామర్శించారు. మిగిలిన పూజారుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.

సమ్మక్క సారక్క దేవతలు కొలువుతీరిన ములుగు జిల్లా మేడారంలో మరో విషాదం చోటు చేసుకుంది. సారలమ్మ పూజారి కాక సంపత్ అనారోగ్యంతో మృతి చెందారు. కన్నేపల్లి గ్రామానికి చెందిన సంపత్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ చికిత్స పొందుతున్నాడు. కాక సంపత్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. వారం రోజుల క్రితం సమ్మక్క పూజారి ముత్తయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. వరుస మరణాల నేపథ్యంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

విషయం తెలిసిన వెంటనే మంత్రి సీతక్క దిగ్భ్రాంతికి లోనయ్యారు.. మృతుడి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి పూజారుల ఆరోగ్య పరిస్థితి పై ఆరాతీశారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశించారు.

 మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…