బాబోయ్‌..మొసలి నోట్లోకి వెళ్లి.. బతికొచ్చిన వృద్ధురాలు..!

|

Nov 20, 2019 | 1:34 PM

ఒకసారి మొసలి నోటికి చిక్కిన జీవి బతికి బట్టకట్టడం కష్టమే. దొరికిన ప్రాణిని తన పదునైన పళ్లతో రక్కి పట్టేస్తుంది. ఎంతటి భారీ కాయమైనా అమాంతం నీళ్లల్లోకి లాగేసుకుని ఆరగించేస్తుంది. అటువంటి క్రూర జంతువు మొసలి నోటికి తగిలిన ఓ వృద్ధురాలు మృత్యుంజయురాలిగా బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైల్‌ గ్రామంలో ఓ వృద్దురాలిపై ఏకంగా రెండు మొసళ్లు ఒకేసారి దాడి చేశాయి.. వృద్ధురాలి కాలును నోట  కరిచి చెరువులోకి  లాక్కెళ్తుండగా తోటి కూలీల […]

బాబోయ్‌..మొసలి నోట్లోకి వెళ్లి.. బతికొచ్చిన వృద్ధురాలు..!
Follow us on
ఒకసారి మొసలి నోటికి చిక్కిన జీవి బతికి బట్టకట్టడం కష్టమే. దొరికిన ప్రాణిని తన పదునైన పళ్లతో రక్కి పట్టేస్తుంది. ఎంతటి భారీ కాయమైనా అమాంతం నీళ్లల్లోకి లాగేసుకుని ఆరగించేస్తుంది. అటువంటి క్రూర జంతువు మొసలి నోటికి తగిలిన ఓ వృద్ధురాలు మృత్యుంజయురాలిగా బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైల్‌ గ్రామంలో ఓ వృద్దురాలిపై ఏకంగా రెండు మొసళ్లు ఒకేసారి దాడి చేశాయి.. వృద్ధురాలి కాలును నోట  కరిచి చెరువులోకి  లాక్కెళ్తుండగా తోటి కూలీల సాయంతో ప్రాణాలతో బయటపడింది. యానంబైలుకు చెందిన రత్తమ్మ మంగళవారం కూలీ పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చే క్రమంలో గ్రామంలోని లక్ష్మీదేవి చెరువు అలుగు వద్ద కాళ్లు కడుక్కునేందుకు దిగింది. ఉన్నట్టుండి కాలును ఏదో లాగుతుందని గ్రహించిన రత్తమ్మ కేకలు వేసింది. అక్కడే ఉన్న తోటి కూలీలు ఆ మొసళ్లను తరిమికొట్టడంతో అవి వృద్ధురాలిని వదిలి నీళ్లలోకి జారుకున్నాయి. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పక్కనే ఉన్న కిన్నెరసాని ప్రాజెక్టులో ఉండాల్సిన మొసలి యానంబైల్‌ చెరువులో ప్రత్యక్షం కావడం, మనుషులపై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్‌ అధికారులు స్పందించి చెరువులోని మొసళ్లను తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.