నేటి నుంచి కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర

|

Apr 28, 2019 | 9:31 AM

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారంటూ టీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపట్టనున్నారు. దీనిలో భాగంగా నేడు భద్రాచలం నుంచి ఈ యాత్ర ప్రారంభంకానుంది. రేపు ఈదుల బయ్యారం నుంచి యాత్రను కొనసాగించనున్నారు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ఈ యాత్ర నిర్వహించనున్నారు. […]

నేటి నుంచి కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర
Follow us on

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారంటూ టీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపట్టనున్నారు. దీనిలో భాగంగా నేడు భద్రాచలం నుంచి ఈ యాత్ర ప్రారంభంకానుంది. రేపు ఈదుల బయ్యారం నుంచి యాత్రను కొనసాగించనున్నారు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ఈ యాత్ర నిర్వహించనున్నారు. కాగా పార్టీ మారిన ఎమ్మేల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భట్టి.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.