వారణాసిలో సీఎం కేసీఆర్‌ కటుంబ సభ్యుల పర్యటన.. తొలిరోజున గంగానదికి పవిత్ర హారతి సమర్పణ

|

Jan 28, 2021 | 5:59 PM

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులు రెండు రోజుల కాశీ పర్యటనలో భాగంగా ఈరోజు వారణాసి..

వారణాసిలో సీఎం కేసీఆర్‌ కటుంబ సభ్యుల పర్యటన..  తొలిరోజున గంగానదికి పవిత్ర హారతి సమర్పణ
Follow us on

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులు రెండు రోజుల కాశీ పర్యటనలో భాగంగా ఈరోజు వారణాసి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభ, ఆయన కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వారణాసిలో పర్యటిస్తున్నారు.

ఈరోజు తొలిరోజున దశాశ్వమేధ ఘాట్ వద్ద వారు గంగా నదికి పవిత్ర హారతి సమర్పించారు. పురాతన సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అస్సీ ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు గంగా నదిలో పడవ ప్రయాణం చేశారు.

వారణాసి తొలిరోజు పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కల్వకుంట్ల కవిత ట్వీట్టర్‌లో షేర్‌ చేశారు. గంగమ్మ ఒడిలో… కాశీ విశ్వనాథుడి సన్నిధిలో…అంటూ కవిత ట్వీట్ చేశారు.