Road Accident: మహబూబాబాద్‌ ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

|

Jan 30, 2021 | 5:51 AM

Road Accident: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గవర్నర్‌ తమిళిసై ...

Road Accident: మహబూబాబాద్‌ ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
Follow us on

Road Accident: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేర్వేరు ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కేసీఆర్‌ ఆదేశించారు.

కాగా, మర్రిమిట్ట వద్ద లారీని ఆటో ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవలే కుమార్తె పెళ్లి కుదరడంతో నూతన దుస్తులు కొనుగోలు చేసేందుకు వధువుతో సహా వరంగల్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రయాణిస్తున్న ఆటో పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. అయితే లారీ కిందకు ఆటో దూసుకెళ్లడంతో ఆటోను ప్రొక్లెయినర్‌ సాయంతో బయటకు తీశారు. మృతదేహాల్లో ముగ్గురు మహిళలున్నారు.

Jammu And Kashmir: జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌… భ‌ద్ర‌తా ద‌ళాల చేతిలో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం…