MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన సీబీఐ.. ఆ రోజున అందుబాటులో ఉండాలంటూ మెయిల్..

|

Dec 06, 2022 | 8:20 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి రాసి లేఖపై అధికారుల నుంచి రిప్లై వచ్చింది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన సీబీఐ.. ఆ రోజున అందుబాటులో ఉండాలంటూ మెయిల్..
Mlc Kavitha
Follow us on

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి రాసి లేఖపై అధికారుల నుంచి రిప్లై వచ్చింది. 11న వివరణకు అందుబాటులో ఉండాలని CBI అధికారులు కవితను కోరారు. ఈ మేరకు ఈ-మెయిల్ ద్వారా కవితకు సీబీఐ సమాచారం ఇచ్చింది. 11న ఉదయం 11 గంటలకు విచారణ నిర్వహిస్తామని సీబీఐ లేఖలో తెలిపింది. ఆరోజున జరిగే విచారణకు హాజరు కావాలంటూ సూచించింది.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చిన  ఒకరోజు తర్వాత సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.  6వ తేదీన విచారణకు సిద్ధమని తెలిపిన కవిత.. ఆ తర్వాత ఫిర్యాదు ఒరిజినల్ కాపీ, ఎఫ్‌ఐఆర్ కాపీ అందించాలంటూ కవిత సీబీఐ అధికారులను కోరారు. కానీ దానికి సీబీఐ నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. ఈ క్రమంలో కవిత జగిత్యాల పర్యటన కారణంగా విచారణకు హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశారు. 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానని ఆ లేఖలో ప్రస్తావించారు.

దీంతో.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనపై ఉదయం నుంచి సస్పెన్స్ కంటిన్యూ అయ్యింది. సీబీఐకి రాసిన లేఖపై రిప్లయ్ రాకపోవడంతో హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉండిపోయారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం