బీజేపీకి షాక్.. బండి సంజయ్‌పై కేసు నమోదు..

| Edited By:

May 13, 2020 | 12:27 PM

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. మంగళ వారం నాడు నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో నాగార్జున సాగర్ సమీపంలో పర్యటించిన ఆయన.. జిల్లాలోని పెద్దవూర మండలం ఉట్లపల్లిలోని బత్తాయి రైతులను పరామర్శించారు. బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి కూడా రాకపోవడంతో.. బత్తాయి రైతులంతా ఆందోళనకు గురవుతున్నారని.. రైతుల నుంచి బత్తాయిలను ప్రభుత్వమే కొనగోలు చేయాలని […]

బీజేపీకి షాక్.. బండి సంజయ్‌పై కేసు నమోదు..
Follow us on

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. మంగళ వారం నాడు నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో నాగార్జున సాగర్ సమీపంలో పర్యటించిన ఆయన.. జిల్లాలోని పెద్దవూర మండలం ఉట్లపల్లిలోని బత్తాయి రైతులను పరామర్శించారు. బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి కూడా రాకపోవడంతో.. బత్తాయి రైతులంతా ఆందోళనకు గురవుతున్నారని.. రైతుల నుంచి బత్తాయిలను ప్రభుత్వమే కొనగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అయితే ఈ క్రమంలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా.. సోషల్ డిస్టెన్స్ కూడా పాటించలేదు. దీంతో పెద్దవూర పోలీసులు బండి సంజయ్‌తో పాటుగా.. మరికొందరు బీజేపీ నేతలపై కేసులు నమోదు చేశారు.