Telangana BJP: ప్రతి కార్యకర్త అందుకు సిద్ధంగా ఉండాలి.. నల్గొండ బీజేపీ సభలో బండి సంజయ్ పిలుపు..

|

Aug 02, 2022 | 3:34 PM

Telangana BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి వేదికగా ప్రారంభమైంది.

Telangana BJP: ప్రతి కార్యకర్త అందుకు సిద్ధంగా ఉండాలి.. నల్గొండ బీజేపీ సభలో బండి సంజయ్ పిలుపు..
Bjp Praja Sangrama Yatra Bandi Sanjay Speech In Yadadri Live Video
Follow us on

Telangana BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి వేదికగా ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా యాదగిరి గుట్టలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రసంగించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ గెలిచిన వెంటనే ఎవరు సీఎం అయినా.. తొలి దర్శనం భాగ్యలక్ష్మి అమ్మవారినే చేసుకుంటామని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఉగ్రనరసింహస్వామి అవతారం ఎత్తి.. టీఆర్ఎస్ రాక్షస పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రతో సీఎం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు బండి. నల్గొండలో బీజేపీ ఎక్కడ ఉందని చాలా మంది మాట్లాడారని, ఖమ్మం జిల్లాలోనూ బీజేపీ బలం ఏంటో చూపిస్తామని అన్నారు. టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా చాలా కామెంట్స్ చేశారు. బీజేపీ బహిరంగ సభ లైవ్ వీడియోను వీక్షించండి.