తెలంగాణలో మరో ఇంటర్మీడియేట్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఫలితాలు విడుదలై ఇన్ని రోజులవుతున్నా బలవన్మరణాలు మాత్రం ఆగట్లేదు. నారాయణపేట జిల్లా ధన్వాడ కొండ్రోనుపల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఫస్టియర్ బైపీసీలో సబ్జెక్ట్ ఫెయిల్ అవడంతో శిరీష అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. శిరీష మృతితో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.