Warangal MP: బీఆర్ఎస్ మరో బిగ్ షాక్.. సీఎం రేవంత్‌ను కలిసిన వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్

|

Mar 15, 2024 | 4:43 PM

బీఆర్‌ఎస్‌కు మరో ఎంపీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలుసుకున్నారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ‌గా ఉన్న పసునూరి, మరోసారి అదే సీటును ఆశించి భంగపడ్డారు. తిరిగి పోటీ చేయాలని విశ్వ ప్రయత్నం చేసినా ఫలించలేదు.

Warangal MP: బీఆర్ఎస్ మరో బిగ్ షాక్.. సీఎం రేవంత్‌ను కలిసిన వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్
Mp Pasunuri Dayakar Met Cm Revanth Reddy
Follow us on

బీఆర్‌ఎస్‌కు మరో ఎంపీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలుసుకున్నారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ‌గా ఉన్న పసునూరి, మరోసారి అదే సీటును ఆశించి భంగపడ్డారు. తిరిగి పోటీ చేయాలని విశ్వ ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇటీవల వరంగల్ నేతలతో సమీక్ష నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. ఎంపీ సీటును కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కేటాయించారు.

తనకు మరోసారి వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ అధిష్టానం పట్టించుకోకపోవడంపై పసునూరి దయాకర్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…