వీధికుక్కలు, పిచ్చికుక్కలు ప్రాణాలు తీస్తున్నాయి.. ఆడుకుంటున్న పిల్లలను కరిచేస్తున్నాయి. పిల్లలు కనిపిస్తే ఎక్కడికక్కడ రక్కేస్తున్నాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగేలా అనే గ్రామంలో ఓ పిచ్చికుక్క బాలుడిపై దాడి చేసింది. దేవేందర్ అనే ఏడేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసిన దృశ్యం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది.. ఈ ఘటనలో బాలుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాలుడిని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
గ్రామానికి చెందిన పెంద్రెం మారుతి కుమారుడు ఏడెళ్ల దేవేందర్ ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో.. ఒక్కసారిగా వచ్చిన పిచ్చి కుక్క బాలుడిపై దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన ఓ మహిళ.. అక్కడకు చేరుకుని కుక్కను తరిమికొట్టింది..వెంటనే తల్లిదండ్రులు బాలుడిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స జరుగుతుందని వైద్యులు తెలిపారు.
ఇదిలాఉంటే.. హైదరాబాద్ జవహర్నగర్లో దారుణ ఘటన జరిగింది.. రెండేళ్ల చిన్నారి వీధి కుక్కలకు బలైపోయాడు.. రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లాడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయ్. ఏం జరుగుతుందో అక్కడున్నవాళ్లు గమనించి వాటిని తరిమేసరికే పిల్లాడి వళ్లంతా గాయాలయ్యాయి. ఒంటిపై ఎక్కడ చూసిన కుక్కకాట్ల దృశ్యాలు కనిపించాయి.. గాయాలపాలైన చిన్నారి విహాన్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. శరీరమంతా గాయాలతో రెండేళ్ల విహాన్ అల్లాడిపోయాడు.. పరిస్థితి విషమించడంతో గాంధీకి తరలించారు.. అక్కడ చికిత్సపొందుతూ చిన్నారి విహాన్ కన్నుమూశాడు.. చిన్నారి విహాన్మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..