జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సరదాగా సెల్ఫీ దిగుదామని వెళ్లిన బావామరదళ్లు చెరువులో పడి గల్లంతయ్యారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైనవారు రఘునాథపల్లి మండలం జీవీ తండాకు చెందిన అవినాష్, అతని మరదళ్లు సంగీత, సుమలతగా గుర్తింపు. అవినాష్ తన భార్య ఇద్దరు మరదళ్లతో కలిసి సరదాగా బొమ్మకూరు రిజర్వాయర్కు వెళ్లారు. రిజర్వాయర్ గట్టు వద్ద సెల్ఫీ దిగిగుతూ అవినాష్, సంగీత, సుమలత అమాంతం నీటిలో పడిపోయారు. గత ఈతగాళ్లు రంగంలోకి దిగి అవినాష్, ఇద్దరు మరదళ్ల డెడ్ బాడీలను బయటకు తీశారు.