స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తామంతా అధికారికంగా టీఆర్ఎస్లో కలిశామని.. తమదే అసలైన సీఎల్పీ కావున.. వెంటనే సీఎల్పీని టీఆర్ఎస్ పార్టీలో కలపాలంటూ స్పీకర్కు లేఖ ఇచ్చారు. మినిస్టర్ క్వార్టర్స్లో స్పీకర్ను కలిసిన ఎమ్మెల్యేలు ప్రత్యేక లేఖను అందజేశారు. ఆ లేఖలో 12మందితో కూడిన సంతకాలు ఉన్నాయి. వెంటనే టీఆర్ఎస్లో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు.