Jio: ఒక్క రీఛార్జ్‌తో 15 ఓటీటీలు ఉచితం.. ఆఫర్‌ కొన్ని రోజులు మాత్రమే

|

May 13, 2024 | 8:46 AM

ఓటీటీ యూజర్లు పెరుగుతోన్న ప్రస్తుత తరుణంలో వారికోసం జియో ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ. 888 ధరతో తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్‌ జియోఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రీపెయిడ్‌ ప్లాన్‌లలో ఉన్న వారితో సహా, ఇప్పటికే ఉన్న యూజర్లందరూ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు ఈజీగా అప్‌గ్రేడ్ చేయవచ్చు....

Jio: ఒక్క రీఛార్జ్‌తో 15 ఓటీటీలు ఉచితం.. ఆఫర్‌ కొన్ని రోజులు మాత్రమే
OTT
Follow us on

ప్రముఖ టెలికం దిగ్గజం రియలన్స్‌ జియో ఇంటర్నెట్ సేవలను వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే రకరకలా ఆఫర్లను ప్రకటిస్తూ యూజర్లను ఆకర్షిస్తోంది. ఓవైపు జియో టెలికం సేవలతో పాటు మరోవైపు ఇంటర్నెట్‌ సేవలను సైతం విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే జియో ఫైబర్‌, జియో ఎయిర్‌ ఫైబర్‌ సేవలను కస్టమర్లకు మరింత చేరువ చేస్తోంది.

ఓటీటీ యూజర్లు పెరుగుతోన్న ప్రస్తుత తరుణంలో వారికోసం జియో ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ. 888 ధరతో తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్‌ జియోఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రీపెయిడ్‌ ప్లాన్‌లలో ఉన్న వారితో సహా, ఇప్పటికే ఉన్న యూజర్లందరూ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు ఈజీగా అప్‌గ్రేడ్ చేయవచ్చు. అదనపు బోనస్‌గా ప్రత్యేక ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు, అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్‌లు తమ జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై 50 రోజుల తగ్గింపును పొందవచ్చు.

ఇదిలా ఉంటే ఈ ఆఫర్‌ కేవలం మే31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. ఈ కొత్త ప్లాన్‌తో యూజర్లు ఏకంగా 15 ఓటీటీలను ఉచితంగా స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. హై-స్పీడ్ డేటా, టాప్ ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌ పొందవచ్చు. అంతేకాదు.. ప్రీమియం ఓటీటీ కంటెంట్‌ను కూడా చూడొచ్చు. ఇక రూ. 888తో రీఛార్జ్‌ చేసుకుంటే 30 ఎంబీబీఎస్‌ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్‌ కనెక్టివీటి పొందొచ్చు. జియో ఫైబర్‌ యూజర్లకు 3300 జీబీ డేటా, ఎయిర్‌ ఫైర్‌ యూజర్లకు 1000 జీబీ డేటా లభిస్తుంది. ఇక ఓటీటీల పరంగా చూస్తే అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ బేస్‌ ప్లాన్‌, జియోసినిమాతో మొత్తం 15 ఓటీటీలను వీక్షించొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..