ఎలాన్ మస్క్.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైమ ఎలాన్ మస్క్ నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. మరీ స్పేస్ ఎక్స్ ద్వారా అంతరిక్షంతో పాటు కార్ల తయారీ వరకూ వ్యాపార దిగ్గజంగా ఎదిగారు. కాగా ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
ట్విట్టర్ను ఎక్స్గా మార్చినప్పటి నుంచీ తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు. కేవలం సమాచార మార్పిడి మాత్రమే ఉపయోగించే యాప్ను ఎలాన్ మస్క్ ఇప్పుడు.. ఆల్ ఇన్ వన్ టూల్గా మార్చేస్తున్నాడు. ఇప్పటికే ఎక్స్లో ఆడియో, వీడియో కాల్స్ సదుపాయం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కొత్త ఫీచర్ను జోడించే పనిలో పడ్డాడు. ఎక్స్ ద్వారా ఇకపై ఆన్లైన్ పేమెంట్స్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అంటే ప్రస్తుతం మన ఉపయోగిస్తున్న గూగుల్ పే, ఫోన్పే లాగా ఎక్స్తో ఇకపై పేమెంట్స్ కూడా చూసుకోవచ్చన్నమాట.
ఈ లెటెస్ట్ అప్డేట్కు సంబంధించిన వివరాలను నిమా ఓజ్వీ అనే ఓ వెబ్ డెవలపర్ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు. త్వరలోనే పేమెంట్స్ యాప్ రానుందని ఇందులో తెలిపారు. ట్రాన్సాక్షన్స్తో పాటు బ్యాలెన్స్, పేమెంట్స్ హిస్టరీ కూడా అక్కడే తెలుసుకోవచ్చు. అయితే ఇతర పేమెంట్ యాప్స్లో ఉన్నట్లు వ్యాలెట్ ఆప్షన్ ఉంటుదా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ట్వీట్స్ చేసుకోవడానికి ఉయోగించిన ట్విట్టర్ను ఎలాన్ మస్క్ ఇంకెన్ని మార్పులు చేస్తారో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఎలాన్ మస్క్ తీసుకొస్తున్న ఈ పేమెంట్ సిస్టమ్ ప్రస్తుతం ఉన్న సంస్థలకు ఎలాంటి పోటీనిస్తుందో చూడాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..