హెచ్ఎండీ గ్లోబల్ నుంచి ఇటీవల విడుదలైన సరికొత్త స్మార్ట్ఫోన్ భారత్లో సేల్స్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్తోపాటు నోకియా ఆన్లైన్ స్టోర్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. నోకియా 7.2 పేరుతో గురువారం మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా, ప్యూర్ డిస్ప్లే వంటి బోల్డన్ని ప్రత్యేకతలున్నాయి.నోకియా 7.2 4జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ ధర రూ.18,599 కాగా, టాప్ ఎండ్ మోడల్ అయిన 6జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,599. ఫ్లిప్కార్ట్, నోకియా వెబ్సైట్ సహా రిటైల్ అవుట్లెట్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్ను కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్బ్యాక్ ఇస్తారు.