సౌర వ్యవస్థ పుట్టుకను చేధించబోతున్న జపాన్?

| Edited By: Srinu

Mar 07, 2019 | 5:39 PM

అంతరిక్ష నౌకా ప్రయోగంలో సరికొత్త రికార్డు సృష్టించింది జపాన్. జపాన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ పంపించిన ఒక అంతరిక్ష నౌక విజయవంతంగా గ్రహశకలం మీదకు దిగింది. హయబుసా 2 అనే అంతరిక్ష నౌకకు సంబంధించిన ఒక ప్రోబ్ మన కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11 గంటలకు ర్యుగు అనే ఉల్క మీదకు దిగింది. అది ఆ ఉల్క యెక్క ఉపరితలం మీద శాంపిలర్ హార్న్ అనే పరికరంతో  కొన్ని డస్ట్ పార్టికల్స్ ని సేకరించి నౌకలోకి […]

సౌర వ్యవస్థ పుట్టుకను చేధించబోతున్న జపాన్?
Follow us on

అంతరిక్ష నౌకా ప్రయోగంలో సరికొత్త రికార్డు సృష్టించింది జపాన్. జపాన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ పంపించిన ఒక అంతరిక్ష నౌక విజయవంతంగా గ్రహశకలం మీదకు దిగింది.

హయబుసా 2 అనే అంతరిక్ష నౌకకు సంబంధించిన ఒక ప్రోబ్ మన కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11 గంటలకు ర్యుగు అనే ఉల్క మీదకు దిగింది. అది ఆ ఉల్క యెక్క ఉపరితలం మీద శాంపిలర్ హార్న్ అనే పరికరంతో  కొన్ని డస్ట్ పార్టికల్స్ ని సేకరించి నౌకలోకి తెచ్చింది.

ఇది ఇలా ఉండగా ఆ అంతరిక్ష నౌక తిరుగు ప్రయాణం మొదలు పెట్టింది.. అనుకున్నవన్నీ కరెక్ట్ గా జరిగితే అది భూమి కి 2020 లో చేరాల్సి ఉంది. ఆ నమూనాలను సరిగ్గా బయల్దేరిన కొద్ది నెలలకు ఆ నౌక ఆస్ట్రేలియా స్పేస్ స్టేషన్ కి చేరవేయాలి. ఇక ఆ నౌక ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది.

ర్యుగు అనేది సోలార్ సిస్టం నుండి చాలా ఏళ్ళ క్రితం వేరుబడిన ఉల్కగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని మీద పరిశోధన చేయడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయని వారి అభిప్రాయం. ‘అటువంటి గ్రహశకలాల నుండి సేకరించిన మట్టి ద్వారా సౌర పుట్టాక వ్యవస్థను, భూమి యొక్క జీవిత చక్రాన్ని తెలుసుకోవచ్చు అని అంటున్నారు.

జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ ఐదు గంటల ఆలస్యం తర్వాత ఈ ప్రక్రియను మొదలు పెట్టారు. అనుకున్న సమయంలో అంతరిక్ష నౌక ఆస్ట్రేలియా చేరుకునే వరకు ర్యుగు నుండి సేకరించిన దానిని భద్రపరుస్తారట. ఆ ప్రయాణం సుమారు మూడు బిలియన్ మైల్స్ గా తేల్చారు.  ఏది ఏమైనా ఇలాంటి మరెన్నో విషయాలు జపాన్ శాస్త్రవేత్తలు కనుగోవాలని అనుకుంటున్నారు.