భారత యూజర్లకు గూగుల్ పిడుగులాంటి వార్త చెప్పింది. నిర్దిష్ట వెబ్పోర్టల్స్ను ఉపయోగించే వారి పాస్వర్డ్లు చోరికి గురైనట్లు పేర్కొంది. వెంటనే పోర్టల్ పాస్వర్డ్లను మార్చుకోవాలంటూ.. ఇండియన్ యూజర్లను అలర్ట్ చేసింది. పలు వార్తా సంస్థలు మొదలుకుని.. కామన్ యూజర్ల.. ల్యాప్టాప్, డెస్క్టాప్, మొబైల్ స్క్రీన్లపై.. నోటిఫికేషన్లు వచ్చాయి. దీంతో డేటా లీకేజీ కారణంగానే.. యూజర్ల పాస్వర్డ్లు చోరీకి గురైనట్లు గూగుల్ పేర్కొంది.
ఫుడ్ ప్రోడక్ట్స్ సేల్ చేసే ఓ ఈ- కామర్స్ పోర్టల్లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నింగా.. వార్నింగ్ పాప్ అప్ వచ్చినట్లు ఓ యూజరు తెలిపారు. అంతేకాదు… ఓ వార్త సంస్థ కూడా పోర్టల్ లాగిన్ అయ్యే క్రమంలో ఇలాంటి నోటిఫికేషన్ ప్రత్యక్షమైనట్లు పేర్కొంది. తాజాగా క్రోమ్ 79లో.. బగ్ను గూగుల్ అతికష్టం మీద సెట్ చేయగా.. మళ్లీ ఇప్పుడు పాస్వర్డ్ల చోరీ అలర్ట్లు టెన్షన్ పెడుతున్నాయి.