Facebook Improvements : ఫోటో పంపిస్తే చెప్పెస్తుంది.. ఫేస్‌బుక్‌లో ఈ కొత్త ఫీచర్ వారి కోసమే…

| Edited By: Rajeev Rayala

Jan 23, 2021 | 5:53 AM

అంధులు, దృష్టి లోపం ఉన్నవారి సౌలభ్యం కోసం ఫేస్‌బుక్‌ తన ఏఐ ఆధారిత సేవల్లో మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. గతంలో అంధులు ఫేస్‌బుక్ ఉపయోగిస్తుంటే ఫొటో వస్తే కేవలం ఫొటో అనే వర్డ్‌ వినిపించేంది. ఇది ఆర్టిఫిషియల్..

Facebook Improvements : ఫోటో పంపిస్తే చెప్పెస్తుంది.. ఫేస్‌బుక్‌లో ఈ కొత్త ఫీచర్ వారి కోసమే...
Follow us on

Facebook Improvements : ఫేస్‌బుక్‌… ఇదెంత ఫేమసో అందరికీ తెలుసు. చాలామంది నిత్యం అందులోనే గడిపేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమం.. సామాజిక బాధ్యతతో ముందుకు అడుగులు వేస్తోంది. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

తాజాగా అంధులు, దృష్టి లోపం ఉన్నవారి సౌలభ్యం కోసం ఫేస్‌బుక్‌ తన ఏఐ ఆధారిత సేవల్లో మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. గతంలో అంధులు ఫేస్‌బుక్ ఉపయోగిస్తుంటే ఫొటో వస్తే కేవలం ఫొటో అనే వర్డ్‌ వినిపించేంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఏఏటీ అంటే ఆటోమేటిక్‌ ఆల్టర్‌నేటివ్ టెక్ట్స్‌ సహాయంతో పనిచేస్తుంది. తాజాగా ఏఏటీని ఫేస్‌బుక్‌ అప్‌డేట్ చేసింది.

ఈ కొత్త అప్‌డేట్‌తో ఫేస్‌బుక్‌లో ఫొటో కనిపిస్తే ఆ ఫొటోను వివరిస్తూ ఏఐ వాయిస్‌ వినిపించనుంది. అందులో ఏమేం ఉంది… ఆ ఫోటో దేనికి సంబంధించినది.. అది గ్రూప్ ఫోటో అయితే ఆ ఫొటోలో ఎంత మంది ఉన్నారు. ఏ పొజిషన్‌లో ఎవరున్నారు.. ఇలా ప్రతి అంశాన్ని వివరిస్తూ అన్ని వివరాలను చెప్పేస్తుంది.

అంతే కాదండోయ్.. ఆ ఫొటో ఎక్కడ తీసుకున్నారు..ఆ ఫోటో తీసుకున్న సమయంతోపాటు లోకేషన్.. ఆ ఫోటోలో ఉన్న పరిసరాలను కూడా తెలియజేస్తుంది. దీంతో అంధులు, దృష్టి లోపం ఉన్నవారు ఫొటోను సులభంగా అర్థం చేసుకుంటారని ఫేస్‌బుక్‌ అంటోంది.