కాలుష్యానికిక చెక్.. మార్కెట్‌లోకి “ఈ-యానా” టాక్సీల ప్రవేశం

| Edited By: Srinu

Dec 12, 2019 | 3:35 PM

నగర కాలుష్యాన్ని ఎదుర్కొనేందకు “ఈ – యానా” కంపెనీ కదం తొక్కింది. నిత్యం హైదరాబాద్ నగరంలో లక్షల వాహనాలు విపరీతమైన కాలుష్యాన్ని వదులుతున్నాయని.. ఈ వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టాలంటే.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం తప్పనిసరంటున్నారు “ఈ-యానా” సంస్థ బృందం. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఆటో, బైక్)  టాక్సీలను ప్రవేశపెట్టింది. ‘ఈ-యానా’ ఎలక్ట్రిక్‌ వాహనాలతోనే వినియోగదారులకు సేవలందించనున్నారు. తొలుత వీటిని వరంగల్, కరీంనగర్‌ నగరాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ […]

కాలుష్యానికిక చెక్.. మార్కెట్‌లోకి ఈ-యానా టాక్సీల ప్రవేశం
Follow us on

నగర కాలుష్యాన్ని ఎదుర్కొనేందకు “ఈ – యానా” కంపెనీ కదం తొక్కింది. నిత్యం హైదరాబాద్ నగరంలో లక్షల వాహనాలు విపరీతమైన కాలుష్యాన్ని వదులుతున్నాయని.. ఈ వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టాలంటే.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం తప్పనిసరంటున్నారు “ఈ-యానా” సంస్థ బృందం. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఆటో, బైక్)  టాక్సీలను ప్రవేశపెట్టింది. ‘ఈ-యానా’ ఎలక్ట్రిక్‌ వాహనాలతోనే వినియోగదారులకు సేవలందించనున్నారు. తొలుత వీటిని వరంగల్, కరీంనగర్‌ నగరాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ సందీప్ తెలిపారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో వీటిని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ- యానా ద్వారా నిరుద్యోగులకు ఉపాది కూడా కలుగుతోందని తెలిపారు. ఈ ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనాలతో కస్టమర్లకు సేవలందిస్తామన్నారు. అయితే ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ ఉంటుందని సందీప్ వెల్లడించారు. వీటిని కస్టమర్లు ఉపయోగించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టినవాళ్ళు అవుతారని.. ప్రతి రైడ్ అనంతరం కస్టమర్‌కి ఓ మెసేజ్ కూడా వెళ్తుందన్నారు.