ఆస్ట్రేలియా ఆదివాసీలకు క్రికెట్ ఇండియా సలామ్… వన్డే మ్యాచ్ ఆరంభంలో బేర్‌ఫూట్ స‌ర్కిల్‌ మధ్యతో నివాళి

ఆస్ట్రేలియా ఆదివాసీ తెగ‌ల‌కు ఆసీస్, ఇండియా క్రికెట‌ర్లు.. నివాళి అర్పించారు. ఆస్ట్రేలియా ఆదిమ జాతుల‌కు ఆ నేల చెందుతుంద‌న్న సందేశాన్ని క్రికెట‌ర్లు వినిపించారు.

ఆస్ట్రేలియా ఆదివాసీలకు క్రికెట్ ఇండియా సలామ్... వన్డే మ్యాచ్ ఆరంభంలో బేర్‌ఫూట్ స‌ర్కిల్‌ మధ్యతో నివాళి
Follow us

|

Updated on: Nov 27, 2020 | 12:45 PM

ఆస్ట్రేలియా ఆదివాసీ తెగ‌ల‌కు ఆసీస్, ఇండియా క్రికెట‌ర్లు.. నివాళి అర్పించారు. ఆస్ట్రేలియా ఆదిమ జాతుల‌కు ఆ నేల చెందుతుంద‌న్న సందేశాన్ని క్రికెట‌ర్లు వినిపించారు. సిడ్నీలో ఇవాళ భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి వ‌న్డే సిరీస్ జరుగుతోంది.

ఈ నేప‌థ్యంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు.. రెండు జ‌ట్ల ప్లేయ‌ర్లు బేర్‌ఫూట్ స‌ర్కిల్‌తో నివాళి అర్పించారు. పాద‌ర‌క్ష‌కాలు ధ‌రించ‌కుండానే.. క్రికెట‌ర్లు ఆదిమ తెగ ప్ర‌జ‌ల‌కు త‌మ గౌర‌వాన్ని తెలిపారు. ఆసీస్ నేల‌కు, స్థానిక తెగ‌ల‌కు, దేశానికి గౌర‌వం ఇవ్వాల‌న్న సందేశాన్ని క్రికెట‌ర్లు ఈ కార్యక్రమం ద్వార తెలిపారు. ఈ సిరీస్ కోసం ఆసీస్ తమ జెర్సీని కూడా మార్చుకుంది. ఆదిమ తెగలు గుర్తు చేస్తూ ప్రింట్‌తో జెర్సీని డిజైన్ చేశారు.

ఆస్ట్రేలియాలో ఆదిమ తెగ‌లు సుమారు 65 వేల ఏళ్ల క్రితం నుంచి ఉన్న‌ట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ దేశాన్ని సుసంప‌న్నం చేసిన‌వారంద‌రికీ గౌర‌వం తెలుపుతున్న‌ట్లుగా క్రికెట‌ర్లు నివాళి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సాంప్ర‌దాయంగా ఆ ప్రాంతానికి చెందిన వారిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా గుర్తించేందుకు క్రికెట్ ఆట‌గాళ్లు బేర్‌ఫూట్ స‌ర్కిల్‌ను నిర్వ‌హిస్తుంటారు. మ‌న‌మంద‌రం ఒకే నేల‌కు చెందిన‌వాళ్ల‌మ‌ని, అంద‌ర‌మూ మ‌నుషుల‌మే అని, క‌లిసిక‌ట్టుగా ఉండాల‌న్న సంకేతాన్ని ఈ నివాళితో చాట‌నున్నారు.