నిన్ను చాలా మిస్ అవుతున్నాం: సుశాంత్‌పై రైనా ఎమోషనల్ వీడియో

| Edited By:

Aug 25, 2020 | 2:03 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణించి రెండు నెలలకు పైననే గడుస్తోంది. అయితే అతడిని ఎవ్వరూ మర్చిపోలేకపోతున్నారు.

నిన్ను చాలా మిస్ అవుతున్నాం: సుశాంత్‌పై రైనా ఎమోషనల్ వీడియో
Follow us on

Raina emotional post on SSR: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణించి రెండు నెలలకు పైననే గడుస్తోంది. అయితే అతడిని ఎవ్వరూ మర్చిపోలేకపోతున్నారు. అతడి ఙ్ఞాపకాలను షేర్ చేసుకుంటూ మిస్ అవుతున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒక్క అభిమానులే కాదు ప్రముఖులు సైతం సుశాంత్‌ని గుర్తు చేసుకుంటూ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ క్రమంలో క్రికెటర్ రైనా ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేసుకున్నారు.

అందులో ట్యాబ్‌లో సుశాంత్ ఫొటోను పెట్టిన రైనా, సెవెన్‌ అంటూ రాసిన ఓ బ్లూ షర్ట్‌(ధోని జెర్సీ నంబర్ 7. ధోని బయోపిక్‌లో సుశాంత్ నటించిన విషయం తెలిసిందే)ని పెట్టారు. అలాగే ఈ వీడియోకు సుశాంత్ నటించిన కేధారినాథ్‌లోని జాన్ నిజర్ పాటను యాడ్ చేశారు. ఇక దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రైనా.. ”బ్రదర్ నువ్వు ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటావు. నీ అభిమానులు నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నారు. మన ప్రభుత్వం, నాయకులపై నాకు నమ్మకం ఉంది. నీ కేసులో నిజం బయటకు వస్తుందని నమ్ముతున్నా. నువ్వు నిజంగా చాలా మందికి స్ఫూర్తి” అని కామెంట్ పెట్టారు. అయితే గతంలోనూ రైనా, సుశాంత్‌ని గుర్తు చేసుకుంటూ పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. కాగా మరోవైపు సుశాంత్ కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన అధికారులు, త్వరలో మరికొంతమందిని విచారించబోతున్నట్లు తెలుస్తోంది.

Read More:

షాకింగ్‌: రెండోసారి సోకిన కరోనా.. హాంకాంగ్‌లో తొలి కేసు నమోదు

కర్ణాటకకు వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్