కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్తో ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటున్నాడు. తాజాగా తన పర్సనల్ లైఫులోని కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను ‘ఓపెన్ నెట్స్ విత్ మయాంక్’ షోలో రివీల్ చేశాడు. భారత మరో ఓపెనర్ శిఖర్ ధావన్తో కలిసి ఇందులో పాల్గొన్నాడు. తన మూడో డబుల్ సెంచరీ గుర్తు చేసుకున్న హిట్ మ్యాన్.. ఆరోజు తన భార్య రితిక కన్నీళ్లు పెట్టుకోవడానికి గల రీజన్ వెల్లడించాడు.
“ఆ మ్యాచ్లో నేను 195 రన్స్ వద్ద ఉన్నప్పుడు సింగిల్ తీయాల్సి వచ్చింది. రన్ తీసే క్రమంలో డైవ్ చేశాను. ఆ సమయంలో, అంటే నేను 196 పరుగుల వద్ద ఉన్నప్పుడు రితికా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత ఎందుకు ఏడ్చావని రితికాను అడిగాను?. రన్ తీస్తున్న సమయంలో డైవ్ చేయడం వల్ల చేతికి దెబ్బ తగిలిందేమోనని బాధ కలిగిందంటూ ఆమె తర్వాత వెల్లడించింది. ఆరోజు చేసిన డబుల్ సెంచరీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆ రోజే మా మ్యారేజ్ డే కాబట్టి” అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన ఈ వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ..వన్డే ఫార్మాట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. దీనితో పాటే వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(264) సాధించిన బ్యాట్స్మన్గా కూడా క్రీజీ రికార్డు నెలకొల్పాడు.