Lightning in a Indonesia Football Match: మరణం ఎప్పుడు, ఎలా సంభవిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతం హార్ట్ ఎటాక్లతో కూర్చున్న వాళ్లు, కూర్చున్నట్లు, ఆడుతున్నవాళ్లు ఆడుతున్నట్లే చనిపోతున్నారు. అయితే, పిడుగులు పడడం వల్ల కూడా కొంతమంది మరణిస్తుంటారు. కొంతమంది మాత్రం పిడుగులు పడినా, బతికి బయటపడుతున్నారు. తాజాగా ఇండోనేషియా నుంచి వచ్చిన ఓ వీడియో అందర్ని కన్నీళ్లు పెట్టించేలా చేస్తోంది. గత శనివారం పశ్చిమ జావాలోని సిలివాంగి స్టేడియంలో ప్రతికూల వాతావరణం మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లోనే ఆటగాడి తలపై పిడుగు పడడంతో మైదానంలో పడిపోయాడు. ఊహించని ఈ ఘటన అందరినీ కలచివేసింది. పక్కనే ఉన్న సహచరులంతా అతడిని ఆసుపత్రికి తరలించే సమయానికి మరణించాడు. ఈ తతంగమంతా స్టేడియంలో అమర్చిన కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చనిపోయిన వ్యక్తి FC బాండుంగ్ వర్సెస్ FBI షుబాంగ్ మధ్య జరిగిన స్నేహపూర్వక మ్యాచ్లో భాగమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో, ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా, మైదానంలో కొంతదూరంలో నిలబడి ఉన్న ఆటగాడిపై అకస్మాత్తుగా ప్రకాశవంతమైన కాంతితో కూడిన మెరుపు పడింది.
ఈ సమయంలో మంటలు కూడా చెలరేగాయి. పిడుగుపాటుకు గురైన ఆటగాడు వెంటనే నేలపై పడిపోయాడు. అయితే, పిడుగుపాటు కారణంగా దూరంగా నిలబడి ఉన్న ఇతరులు కూడా మైదానంలో కూర్చుండిపోయారు. మిగతా వారంతా తమను తాము రక్షించుకోవడానికి నేలపై పడుకున్నారు. కొందరు బయట పరిగెత్తడం ఈ వీడియోలో చూడొచ్చు.
కొన్ని నిమిషాల తర్వాత, అంతా సర్దుకుకంది. ఆ వెంటనే ఆటగాళ్లందరూ మెరుపు కారణంగా అపస్మారక స్థితిలో ఉన్న తమ సహచరుడి వైపు పరిగెత్తారు. అతనిని మేల్కొలపడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో బాధితుడు ఊపిరి పీల్చుకున్నాడంట. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆసుపత్రికి చేరుకోగానే ఆటగాడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
This happened during a football match in Indonesia 🇮🇩 pic.twitter.com/JHdzafaUpV
— Githii (@githii) February 11, 2024
ఇండోనేషియా ఫుట్బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురికావడం గత 12 నెలల్లో ఇది రెండోసారి. 2023లో సోరాటిన్ U-13 కప్ సందర్భంగా తూర్పు జావాలోని బోజోంగోరోలో ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురయ్యాడు. కార్డియాక్ అరెస్ట్తో బాధపడుతున్న ఆటగాడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 20 నిమిషాల పాటు ప్రయత్నించిన వైద్యులు అతడిని స్పృహలోకి తీసుకురావడంలో విజయం సాధించారు. మైదానంలో ఉన్న మరో ఆరుగురు ఆటగాళ్లు కూడా పిడుగుపాటుకు గురై ఆ తర్వాత ఆసుపత్రిలో గడపాల్సి వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..